Thursday, April 25, 2024
- Advertisement -

టోర్నీ వాయిదా.. క్రీడా అభిమానులకి చేదు వార్త..!

- Advertisement -

కరోనా ప్రభావం మరో టోర్నీపై పడింది. ఝార్ఖండ్​లో ఏప్రిల్ 3న ప్రారంభం కావాల్సిన ‘జాతీయ జూనియర్ హాకీ టోర్నమెంట్​’ వాయిదా పడింది. అందులో పాల్గొనాల్సిన కొందరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్​గా తేలడమే ఇందుకు కారణం.

ఆతిథ్య వేదిక సిమ్దేగాకు వచ్చిన చంఢీగడ్​ జట్టు ఆటగాళ్లకు పరీక్షలు చేయగా, అందులో ఐదుగురికి పాజిటివ్​గా తేలింది. ఝార్ఖండ్ బృందంలోని ఆరుగురు ప్లేయర్లకు కూడా కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో వారందరినీ ఐసోలేషన్​కు పంపి, ముందు జాగ్రత్తగా టోర్నీని వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 53,480 మందికి వైరస్​ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 354 మంది మరణించారు. 41,280 మంది వైరస్​ను జయించారు.

ధోనీ సేన పై ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..!

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి షాకుల మీద షాకులు!

‘వకీల్‌ సాబ్’కి షాక్ ఇచ్చిన పోలీసులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -