- Advertisement -
కరోనా ప్రభావం మరో టోర్నీపై పడింది. ఝార్ఖండ్లో ఏప్రిల్ 3న ప్రారంభం కావాల్సిన ‘జాతీయ జూనియర్ హాకీ టోర్నమెంట్’ వాయిదా పడింది. అందులో పాల్గొనాల్సిన కొందరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్గా తేలడమే ఇందుకు కారణం.
ఆతిథ్య వేదిక సిమ్దేగాకు వచ్చిన చంఢీగడ్ జట్టు ఆటగాళ్లకు పరీక్షలు చేయగా, అందులో ఐదుగురికి పాజిటివ్గా తేలింది. ఝార్ఖండ్ బృందంలోని ఆరుగురు ప్లేయర్లకు కూడా కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో వారందరినీ ఐసోలేషన్కు పంపి, ముందు జాగ్రత్తగా టోర్నీని వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 53,480 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 354 మంది మరణించారు. 41,280 మంది వైరస్ను జయించారు.
ధోనీ సేన పై ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..!