కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను విజయవాడ, నూజీవీడు ఆసుపత్రులకు తరలించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం అతి వేగమే అని తెలుస్తుంది. కాగా, బాధితులను నూజీవీడు లయన్ తండాకు చెందిన కూలీలుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. రోడ్డు భద్రతా చర్యలు తీసుకుంటున్నా.. కొంత మంది నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
బాక్సాఫీస్ను షేక్ చేస్తోన్న జాతిరత్నాలు !