ఈ మద్య సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో ఇది కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. అప్పట్లో తెలుగు, తమిళ, మళియాళ, హిందీ భాషల్లో సూపర్ హిట్ అయిన దృశ్యం చిత్రానికి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మళియాలంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం సీక్వెల్ రిలీజ్ కూడా అయ్యింది. మలయాళం లో హిట్ అయిన ‘దృశ్యం 2’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో రానా కూడా నటిస్తున్నాడనే వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్రలో రానా నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ విషయం పై రానా స్పందిస్తూ ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని… ఆ చిత్రంలో తాను నటించడం లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం తాను ‘అరణ్య’ చిత్రం విడుదల పనుల్లో బిజీగా ఉన్నానని అన్నారు. మరోపక్క, పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్ కూడా రూపొందుతోంది.
టాటా కి వాక్సిన్.. వేసుకున్న తరువాత ఆయన మాటలు..!
మీకు టీకా కావాలా.. అయితే ఇందులో లాగ్ ఇన్ అవ్వండి..!
ఆ రెండు నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ.. తాజా పరిస్థితిపై సమీక్షా..!