దేశ రాజధాని ఢిల్లీ- డెహ్రాడూన్ మధ్య నడిచే శాతాబ్ది ఎక్స్ప్రెస్కు చెందిన ఒక బోగీలో శనివారం భారీగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. శతాబ్ది ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి బయలు దేరి వస్తున్నప్పుడు కాస్రో రైల్వే స్టేషన్ సమీపంలో మంటలు చెలరేగాయని ఉత్తరాఖండ్ పోలీసు చీఫ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు.
అయితే, ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టమూ సంభవించలేదని ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదం నుంచి అందరినీ సురక్షితంగా రక్షించామని తెలిపారు. మంటలు అంటుకున్న వెంటనే రైలు నుంచి సంబంధిత అగ్న ప్రమాద భోగిలను వేరే చేసినట్టు అశోక్ కుమార్ వివరించారు. ఇక ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా రైలు కోచ్ సి- 5 లో మంటలు చెలరేగాయని ఢిల్లీ రైల్వే అధికారులు వెల్లడించారు.
“ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని గార్డ్ సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక దళానికి సమాచారం ఇచ్చారు. కోచ్లోని మొత్తం 35 మంది ప్రయాణికులను ఇతర కోచ్లలో తరలించి సర్దుబాటు చేశారు. రైలు తిరిగి తన గమ్యానికి బయలు దేరింది “అని రైల్వే అధికారులు తెలిపారు. తాజాగా రైలు డెహ్రాడూన్కు చేరుకుందని ఉత్తరాఖండ్ అశోక్ డీజీపీ కుమార్ వెల్లడించారు.
‘ఆర్ఆర్ఆర్’ నుంచి మార్చి 15న అలియా ఫస్ట్ లుక్ రిలీజ్
బుల్లితెరపై దేవిశ్రీ ప్రసాద్ అదుర్స్ !
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కృతిశెట్టి రోమాన్స్ !
అరటి తొక్కతో ఇన్ని ప్రయోజనాలున్నాయా !