గత కొంత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కరోనా కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కాల్పుల కలకలం స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాబాద్ లోని కూకట్ పల్లిలో ఓ బ్యాంక్ లో ఏటీఎంలో డబ్బులు నింపుతున్న సిబ్బందిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఇద్దరిపై కాల్పులు జరిపి దండగులు డబ్బులు ఎత్తుకెళ్లారు.
సెక్యూరిటీ గార్డుతోపాటు సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని అస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన సెక్యూరిటీ గార్డు అలీ మృతి చెందాడు. అతడి ఉదర భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఏటీఎం సిబ్బందిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. కాల్పులు జరిగిన స్థలాన్ని సీపీ సజ్జనార్ పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజి ఆధారంగా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు షురూ చేశారు. దుండగులు ఓ బైక్ పై వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు గుర్తించారు.
కరోనా ఎఫెక్ట్.. వెంకటేష్ ‘నారప్ప’ విడుదల వాయిదా