Friday, April 19, 2024
- Advertisement -

కూకట్ పల్లి కాల్పులు.. అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల పనే : సీపీ సజ్జనార్

- Advertisement -

హైదరాబాద్ కూకట్ పల్లి హెచ్ డీఎఫ్ సీ ఏటీఎం దగ్గర గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఆలీ అనే సెక్యూరిటీ గార్డు చనిపోయాడు. అయితే, ఈ ఘటన గురించి తెలియగానే వెంటనే సైబరాబాద్ సీపీ సజ్జనార్ తన బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులపనేనని ప్రాథమికంగా గుర్తించారు.

దోపిడీకి కంట్రీ మేడ్ రివాల్వర్ వాడారని, దానికి సంబంధించిన ఒక మ్యాగజైన్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇది కచ్చితంగా బయటి గ్యాంగ్ పనేనని, కాల్చిన తీరు చూస్తే వాళ్లు పక్కా ప్రొఫెషనల్స్ అని.. ఘటన స్థలంలో ఒక గన్ కాట్రిడ్జ్‌తో పాటు హెల్మెట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని సీపీ సజ్జనార్ అన్నారు.

పారిపోయిన దుండగులను వెతికి పట్టుకునేందుకు ఆయన ఎస్ఓటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి 6 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. దుండుగలను రూ.5 లక్షలు దోచుకెళ్లినట్లు, గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. కాల్పుల్లో ఆలీ పొట్టలోకి బుల్లెట్స్ దూసుకెళ్లాయి.. దాంతో ఆయన మరణించారని.. గాయాలపాలైన మరో వ్యక్తి శ్రీనివాస్‌ను నిమ్స్ ఆస్పత్రికి తరలించామని సీపీ తెలిపారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కన్నుమూత

వైరల్ గా మారిన నటి రాధిక కొత్త లుక్!

తెలంగాణలో లాక్ డౌన్ ఆలోచన లేదు : మంత్రి ఈటెల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -