ఏపి టీడీపీ లో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా పెడన మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు గుండెపోటుతో కన్నుమూశారు. గత రెండు రోజుల క్రితం వెంకట్రావు అనారోగ్యం పాలు కావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో గుండెపోటు రావడంతో గురువారం తుదిశ్వాస విడిచారు.
కాగిత వెంకట్రావు స్వగ్రామం నాగేశ్వరరావు పేట. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు కాగిత కృష్ణప్రసాద్ రాజకీయ వారసత్వం అందుకోగా, కుమార్తె వైద్య నిపుణురాలు. కృష్ణా జిల్లాకు చెందిన వెంకట్రావు టిడిపి ప్రభుత్వంలో ప్రభుత్వ చీఫ్విప్గా, టిటిడి చైర్మన్గా కూడా పనిచేశారు.
రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్గా కూడా ఆయన వ్యవహరించారు. వెంకట్రావు మృతిపై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు , పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ బాబు, పలువురు టిడిపి నేతలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.