గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆరువేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దాంతో ఇక లాక్ డౌన్ తప్పదని పలు మీడియా, సోషల్ మాద్యమాల్లో వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 45 ఏళ్ల పై బడిన వారికి మాత్రమే ఉచితంగా ఇస్తామనడంలో ఔచిత్యం లేదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ను అందజేయాలని కోరారు. తెలంగాణలో 18 ఏళ్ల పై బడిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు 3.3 కోట్ల డోసులు కావాలని, అయితే వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థల సామార్ధ్యం ఆరు కోట్ల డోసులేనని అన్నారు. లాక్ డౌన్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదని స్పష్టం చేశారు.
కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందని, అయితే కేంద్రం ఇప్పటి వరకు కరోనా విషయంలో రాష్ట్రలకు పెద్దగా చేసింది ఎం లేదని ఆరోపించారు. కేంద్రం చేయాల్సిన తప్పులన్ని చేసి రాష్ట్రాలను నిందించడం సరికాదని ఆయన తెలిపారు.కేంద్రం చెప్పిన మాటల్లో వాస్తవాలు ఉంటే ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు.