Friday, April 19, 2024
- Advertisement -

వైసీపీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం!

- Advertisement -

ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇనమడుగు క్రాస్ రోడ్డు స‌మీపంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న‌ కారును లారీ ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఎమ్మెల్యే కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో కారులో ఆయనతో పాటు విజయా డెయిరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. దేవుడి ద‌యవ‌ల్ల ప్రాణాలతో బయట పడ్డామని ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి చెప్పారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రభాస్ కి విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో?

జీహెచ్ఎంసీ కార్మికులకు శుభవార్త!

అతి వేగం ప్రాణం తీసింది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -