Friday, May 3, 2024
- Advertisement -

అనుమానంతో భార్యను ముక్కలుగా నరికి నదిలో పడేశాడు.. చివరికి..

- Advertisement -

ఈ మద్య భార్యభర్తల మద్య చిన్న చిన్న కారణాల వల్ల విడాకులు పుచ్చుకోవడం.. అనుమానాల తో ఒకరిని ఒకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. అమానం పేరుతో కట్టుకున్న భార్యను చంపుతున్న సంఘటనలు దేశంలో రోజుకు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళితే.. మండ్య జిల్లా పాండవపుర తాలూకా దేశవళ్లికి చెందిన ఆశా (28), రంగప్ప భార్యభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు, భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో నాలుగు నెలల క్రితం రంగప్ప, బావ చంద్రతో కలిసి ఆశాను నరికి చంపాడు.

గత కొంత కాలంగా రంగప్ప ఆశపై అనుమానం పెంచుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మద్య ఘర్షణ అవుతుంది. దీంతో భార్యను చంపేందుకు పక్కాప్లాన్ వేశాడు. ఈ నేపథ్యంలోనే కొడవలితో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి హేమావతి నదిలో పడేశారు. అయితే వీరిపై అనుమానించిన ఆశా తండ్రి గౌరి శంకర్‌ పాండవపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదే క్రమంలో కృష్ణరాజపేట పోలీసులు గుర్తు తెలియని మృతదేహంపై సమాచారం ఇచ్చారు. గౌరి శంకర్‌ మృతదేహాన్ని చూసి తన కుమార్తెగా గుర్తించాడు. ఇక రంగప్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయగా అసలు విషయాలు బయట పెట్టాడు. కాగా తల్లి చనిపోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారిపోయారు. అంతేకాకుండా ఇటు తండ్రి జైలుపాలయ్యాడు. ఇప్పడు పిల్లల ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు.

దేత్తడి హారికకు టూరిజం డిపార్ట్‌మెంట్ దిమ్మతిరిగే షాక్!

రణబీర్ కపూర్ కు కరోనా పాజిటివ్!

ఉత్తరాఖండ్ లో రాజకీయ సంక్షోభం.. సీఎం పదవి పై కన్ను..! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -