కొడుకు పుట్టిన రోజు నాడె కుటుంబంలో తీవ్ర విషాదం చోటచేసుకుంది. పుట్టినరోజు నాడు సంబరంగా కట్ చేయాలని తెచ్చుకున్న కేక్ వారి ప్రాణాలు తీసింది.కేక్ తిని తండ్రీ కొడుకు మృతి చెందగా.. మృతుడి భార్య, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిద్ధిపేట జిల్లా కొమరవెల్లి మండలం ఐనాపూర్లో ఈసంఘటన చోటు చేసుకుంది.
ఐనాపూర్కు చెందిన రవి (38) దంపతుల కొడుకు రామ్చరణ్ (8) పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల కోసం రామ్చరణ్ బాబాయి కేక్ పంపించాడు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ తినిపించగా.. ఆ కేక్ తిన్న వెంటనే రాంచరణ్,రమేష్ మృతి చెందారు. రమేష్ భార్య భాగ్యలక్ష్మి, కుమార్తె పూజితలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అన్నదమ్ముల మధ్య గతకొంతకాలంగా విరోధమున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తమ్ముడు పంపించిన కేక్లో విషం కలిపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.