Wednesday, April 24, 2024
- Advertisement -

హీరోయిన్స్ ఆ పని చేస్తే నాకు నచ్చదు: పూరి జగన్నాథ్

- Advertisement -

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలకు దర్శకత్వం వహించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అలాగే పూరి జగన్నాథ్ ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్స్ ను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.పూరి జగన్నాథ్ తరుచు తనకు తెలిసిన విషయాలను యూట్యూబ్ ఛానల్ లో “పూరి మ్యూజింగ్స్” పేరిట అభిమానులతో పంచుకుంటూన్న విషయం తెలిసిందే.

తాజాగా పూరి జగన్నాథ్ “సింగిల్‌ బై ఛాయిస్‌” అనే కాన్సెప్ట్‌ గురించి వివరిస్తూ మహిళల గొప్పతనాన్ని వివరించారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు.సినిమా హీరోయిన్స్‌ పెళ్లిళ్లు చేసుకుంటే నాకెందుకో నచ్చదు. ఎందుకంటే కోటిమందిలో ఒకరికి నటిగా అవకాశం లభిస్తుంది. అందుకే వాళ్లు ఎంతో స్పెషల్‌. వాళ్లు కూడా అందరిలాగే పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కంటే నాకు నచ్చదు. హీరోయిన్స్‌ తమ శక్తిని ఈ దేశాన్ని మార్చడానికి ఉపయోగించాలని సూచించారు.

Also read:నా భర్త మాటల వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న: ప్రియమణి

భారత్‌లో ఇప్పుడిప్పుడే రైజింగ్‌ ట్రైబ్‌ ఆఫ్‌ సింగిల్‌ ఉమెన్‌’ అనే కాన్సెప్ట్‌ మొదలవుతుంది. హీరోయిన్స్‌ మాత్రమే కాదు ధైర్యవంతురాలైన ప్రతి మహిళా దేవతలా మారాలి. మంగళసూత్రం మర్చిపోండి. నేను స్ట్రాంగ్‌ ఉమెన్‌ అని మీరు ఫీలైతే జీవితంలో సింగిల్‌గా ఉండిపోండి. స్ట్రాంగ్‌ ఉమెన్‌ మాత్రమే ఈ దేశాన్ని మార్చగలరు అని పూరీ వివరించారు. తాజాగా పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా “లైగర్ “సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ప్రస్తుతం ఈ మూవీ కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

Also read:సుడిగాలి సుధీర్ పెళ్లిపై తండ్రి షాకింగ్ రియాక్షన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -