Thursday, May 9, 2024
- Advertisement -

రక్తం రుచి మరిగిన పెద్దపులి.. మరింత వేటలో అధికారులు!

- Advertisement -

అసలే కరోనా వైరస్ తో నానా కష్టాలు పడుతున్న సమయంలో బర్డ్ ఫ్లూ అంటూ బెంబేలెత్తిస్తుంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు కొమురం భీం జిల్లా కంది భీమన్న అటవీప్రాంతంలో రక్తం రుచి మరిగిన పెద్దపులి కలకలం సృష్టిస్తుంది. ఇద్దరు గిరిజనులను ఈ పులి పొట్టన పెట్టుకుంది. మనుషులు, జంతువు దీనికి ఆహారం అయ్యారు. ఈ పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు పలు ప్రాంతాల్లో ఎరలు ఏర్పాటు చేసినా, ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ ఆ ఎరలకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది.

టైగర్ ట్రాకర్లు, రెస్క్యూ బృందాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులు, వైద్య బృందాలతో కంది భీమన్న అటవీప్రాంతం అధికారులు జల్లెడ పడుతున్నారు. మొత్తం 150 మంది ఈ పులి వేటలో నిమగ్నమయ్యారంటే దీని ప్రభావం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

అయితే రాత్రివేళల్లో జంతువులపై మత్తు మందు ప్రయోగించడానికి నిబంధనలు అంగీకరించవు.. అయినా రాత్రి వేళల్లో పులిని బంధించడం కూడా కష్టమే అంటున్నారు. ఇక్కడి అటవీప్రాంతంలో ఎత్తయిన మంచెలు ఏర్పాటు చేసుకుని పులి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -