2019లో ఫాలో అయిన సెంటిమెంట్నే రీపిట్ చేయనున్నారు వైసీపీ అధినేత జగన్. ఈ నెల 16న ఇడుపులపాయకు చేరుకోనున్న సీఎం జగన్ వైఎస్ఆర్ ఘాట్ వద్ద పూజలు చేయనున్నారు. ఇక అదే రోజు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఇక అదే రోజు వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు జగన్.
ఇచ్ఛాపురం సభ అనంతరం విజయవాడ పశ్చిమ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా వైసీపీ శ్రేణులు సైతం బహిరంగ సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీగా జనసమీకరణకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఇప్పటికే వివిధ దఫాల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు జగన్. పెద్ద ఎత్తున సిట్టింగ్లను మార్చారు.రెండోసారి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.