ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ రిలీజ్ కానుందా..?ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి ఫస్ట్ వీక్లో షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఈసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 16న ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
లోక్సభతో పాటు ఏపీ ఎన్నికలు కూడా ఏప్పిల్లోనే జరిగే అవకాశం ఉంది. ఇక ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ జవహర్ రెడ్డి ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారుల బదిలీల వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, ఇతర సమస్యలపై అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇక ఏపీ ఓటర్ల తుది జాబితాను ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో 4.08 కోట్ల ఓటర్లు ఉండగా 10 కంటే ఎక్కువ ఓటర్లు కలిగిన 1.51 లక్షల ఇళ్లను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి.