టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా పవన్ పార్టీకి 21 అసెంబ్లీ,2 ఎంపీ స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు 18 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు పవన్. కాకినాడ నుండి పోటీ చేసే ఎంపీ అభ్యర్థిని ప్రకటించినా మచిలీపట్నంను మాత్రం హోల్డ్లో పెట్టారు.
ఇక్కడి నుండి మెగాబ్రదర్ నాగబాబును బరిలోకి దించి ఎంపీ బాలశౌరిని అవనిగడ్డ అసెంబ్లీ నుండి పోటీ చేయిస్తారని వార్తలు వచ్చాయి. అయితే తీవ్ర తర్జనభర్జనల అనంతరం అవనిగడ్డ అసెంబ్లీ, మచిలీపట్నం ఎంపీ సీటుపై జనసేనాని ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా విక్కుర్తి శ్రీనివాస్ను ఖరారు చేసినట్లు సమాచారం.
ఇక మచిలీపట్నం లోక్ సభ అభ్యర్థిగా బాలశౌరి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. చివరి వరకు తన సీటును నాగబాబుకు దక్కకుండా బాలశౌరి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రెండు రోజుల్లో వీరి పేర్లను అఫిషియల్గా ప్రకటించనున్నారట పవన్.