- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. పోస్టల్ బ్యాలెట్లో స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పూర్తి మెజార్టీ సాధించే అవకాశం ఉంది.
ఇక కాంగ్రెస్ గెలిస్తే ఎవరు సీఎం అనే దానిపై క్లారిటీ లేదు. ఇదే సమయంలో తాను సీఎం రేసులో ఉన్నానని తెలిపారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. కాంగ్రెస్ 78 స్థానాలకు పైగా గెలుస్తుందని… ఉమ్మడి ఖమ్మం జిల్లాలో10కి10 స్థానాలు గెలుస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేశా..గెలిచిన వారిని క్యాంప్ కు తీసికెళ్తే తప్పేంటి? అన్నారు. తెలంగాణ ప్రజలు మాపై ఏ నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకంను నేరవేరుస్తామన్నారు.
మొత్తం 119 నియోజకవర్గాలకు 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తెలంగాణలో మొదటగా భద్రాచలం నియోజకవర్గం ఫలితం వెలువడనుంది.