- Advertisement -

బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతోంది!

- Advertisement -

2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ అంచనాలను ప్రకటించారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. మే 4వ తేదీన వెలువడనున్న ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) సరికొత్త చరిత్ర సృష్టించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

మే 4వ తేదీన వెలువడే ఫలితాల్లో బీజేపీ ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ కొట్టబోతోంది. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లోనూ (పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం మరియు పుదుచ్చేరి) ప్రజలు బీజేపీ కూటమికే పట్టం కట్టబోతున్నారని క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయి అని ప్రధాని అన్నారు.

విపక్షాల విభజన రాజకీయాలను తిప్పికొట్టి, ప్రజలు కేవలం అభివృద్ధి మరియు సుపరిపాలనకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తమ డబుల్ ఇంజన్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఎస్పీ, కాంగ్రెస్ మరియు ఇతర విపక్ష పార్టీలు కేవలం బుజ్జగింపు రాజకీయాలకు పరిమితమయ్యాయని, అందుకే ప్రజలు వారిని తిరస్కరిస్తున్నారని మోదీ విమర్శించారు. మే 4 తర్వాత విపక్షాల అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని ఎద్దేవా చేశారు.

సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఓటర్లలో ఉన్న ఈ ఉత్సాహమే బీజేపీ విజయానికి నిదర్శనమని, ప్రతి పోలింగ్ బూత్ వద్ద కమలం వికసిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -