Saturday, April 27, 2024
- Advertisement -

కేసీఆర్‌కు షాక్..కాంగ్రెస్‌లోకి గ్రేటర్ మేయర్!

- Advertisement -

కాంగ్రెస్‌లో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు,మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక తొలి ఎమ్మెల్యేగా దానం నాగేందర్ హస్తం కండువా కప్పుకోగా ఆయనకు సికింద్రాబాద్ ఎంపీ సీటును కేటాయించింది కాంగ్రెస్. ఇక తాజాగా గ్రేటర్లో మరో బిగ్ షాక్ బీఆర్ఎస్,కేసీఆర్‌కు తగలనుంది.

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీతో విజయలక్ష్మీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయలక్ష్మీని కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించగా త్వరలో నిర్ణయం చెబుతానని తెలిపినట్లు సమాచారం.

ఇక గ్రేటర్ నుండి ఇప్పటివరకు 13 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. గ్రేటర్ పరిధిలోని మరో ఎమ్మెల్యేతోపాటు, జీహెచ్ఎంసీ మేయర్, పలువురు కార్పొరేటర్లు హస్తం పార్టీలో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే బీఆర్ఎస్‌కు బిగ్ షాకే.

ప్రస్తుత బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తే విజయలక్ష్మీ. కేకే గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక విజయలక్ష్మీ 2016,2021 ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలుపొందారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -