తెలంగాణ కాంగ్రెస్లో చేరికల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు కుమార్తె, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు కాంగ్రెస్ నేతలు.
రేపో,మాపో రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యలు కాంగ్రెస్లో చేరనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ జరగనుంది.
ఈ సభకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ హాజరుకానుండగా వీరి సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇక ఇవాళ సీఎం రేవంత్తో భేటీ కానున్నారు కడియం శ్రీహరి. పార్టీలో చేరిక, భవిష్యత్పై చర్చించనున్నారు. ఇక త్వరలోనే మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారు.