Tuesday, May 21, 2024
- Advertisement -

లోకేష్ పొలిటికల్ కామెడీ..నెటిజన్ల సెటైర్!

- Advertisement -

సినిమా హీరోలను మించి నటిస్తున్నారు టీడీపీ నేత నారా లోకేష్. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే ఇదే అర్ధం అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీకి అన్ని తానై ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న లోకేష్ ఇచ్చిన ఏ నిరసన కార్యక్రమం పెద్దగా సక్సెస్ కాలేదు.

చివరికి ఢిల్లీకి వెళ్లి ఏదో చేద్దామనుకున్న కేవలం మీడియా ఇంటర్వ్యూలకే పరిమితమయ్యారు లోకేష్‌. ఇక ప్రతీ శనివారం టీడీపీ ఇస్తున్న నిరసన కార్యక్రమాల పిలుపుకు పెద్దగా స్పందన రాని పరిస్థితి నెలకొంది.

మరోవైపు చంద్రబాబు రిమాండ్ 44 రోజులకు చేరింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన లోకేష్…చంద్రబాబు వీరుడని, ఎవరికి తలవంచమని గంభీర ప్రకటనలు చేశారు. ఇక బాబును నెల్సన్ మండేలాతో పోల్చి తన రాజకీయ అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. చంద్ర‌బాబు త‌ల‌వంచ‌డు, త‌ల దించ‌డు అని ఏదేదో మాట్లాడారు. అయితే లోకేష్ ఎమోషనల్‌గా రెచ్చగొట్టి ఆ సెంటిమెంట్‌ని క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఎందుకంటే లోకేష్‌ని ఇప్పటికి ఏపీ ప్రజలు ఓ కామెడీ పీస్‌గానే చూసే పరిస్థితి ఉందని ఆ పార్టీ నేతలే చెబుతున్న పరిస్థితి.

వాస్తవానికి చంద్రబాబు రిమాండ్‌ని ప్రజలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే టీడీపీ నేతలు నానా యాగి చేస్తున్న ప్రజాక్షేత్రంలో మాత్రం చంద్రబాబు విలన్‌గానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే బెయిల్ రావడం లేదని ప్రజలు చర్చించుకుంటున్న సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో లోకేష్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -