Tuesday, May 21, 2024
- Advertisement -

Nara Lokesh:కాంతితో క్రాంతి..ఫ్లాపేనా?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత రోజుకో కార్యాచరణతో ముందుకుసాగుతోంది టీడీపీ. బాబుతో నేను కార్యక్రమం, కొవ్వొత్తుల ర్యాలీ,అసెంబ్లీలో పోరాటం ఇలా ఎన్ని చేసిన ప్రజల నుండి స్పందన అంతంత మాత్రమే. ఇక రీసెంట్‌గా మోత మోగిద్దాం అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ప్రజలంతా 5 నిమిషాల పాటు చంద్రబాబు అరెస్ట్‌ని నిరసిస్తూ విజిల్స్,సౌండ్స్,బండి హారన్‌ మొత్తంగా శబ్ద కాలుష్యం చేయాలని పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి అంత స్పందన రాకపోగా పలువురు టీడీపీ నేతలపై కేసులు కూడా నమోదయ్యాయి. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఈ కార్యక్రమం సందర్భంగా ఓవరాక్షన్ చేసిన టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

ఇక తాజాగా మరో కార్యక్రమాన్ని ఎంచుకుంది.కాంతితో క్రాంతి పేరిట శనివారం రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగిద్దాం అని పిలుపునిచ్చారు లోకేష్. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేద్దామన్నారు. ఇక చంద్రబాబుకు మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నారు.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా టీడీపీ నేతలకు ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఎలా వస్తున్నాయని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయి మరో నాలుగు రోజులైతే నెల. ఏపీలో బాబు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ నేతల హడావిడి , చంద్రబాబు అనుకూల మీడియాలో తప్ప మరెక్కడ బాబు అరెస్ట్‌కు సంబంధించిన న్యూస్ రావడం లేదు. అవినీతి చేసిన వారు ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి. ఇక ప్రజలు ఎప్పుడో చంద్రబాబు అరెస్ట్‌ను లైట్ తీసుకోగా మెల్లమెల్లగా టీడీపీ నేతలు కూడా అలవాటు చేసుకునే పరిస్థితి నెలకొంది. ఇక పవన్‌ సైతం చంద్రబాబు అరెస్ట్‌ను ఎక్కడా ప్రస్తావించడం లేదంటే అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే బాబు అరెస్ట్ సింపతి వర్కవుట్ కాలేదు. ఇలాంటి సమయంలో సిల్లీ కార్యక్రమాలతో ప్రజల్లో మరింత చులకనవడం తప్ప టీడీపీకి ఎలాంటి ఉపయోగం ఉండబోదని, ఈ విషయం లోకేష్ అండ్ కోకు ఎప్పుడు అర్ధమవుతుందోనని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -