తెలంగాణ ఎన్నికల ప్రచారం మరో నాలుగైదు, రోజులు పూర్తి కానుంది. దీంతో ప్రధాన పార్టీలన్ని ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇక బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తుండగా మిగితా చోట్ల బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారు. అయితే పవన్ ప్రచారానికి అంత స్పందన రావడం లేదు.
ఎందుకంటేఎన్నికలు అనగానే ప్రత్యర్థులపై విరుచుకుపడాలి… అధికార పార్టీపై అస్త్రశస్త్రాలు, మాటల తూటాలు సంధించాలి. ఇక ప్రతిపక్షం విఫలమైతే తాము ఉన్నామని భరోసా కల్పించాలని. కానీ తెలంగాణ ప్రచారంలో పవన్ చేస్తున్న ప్రచారం చూస్తే ఎవరికైనా అనుమానం తలెత్తకమానదు.
బీజేపీతో చేతులు కలిపినా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను పల్లెత్తూ మాటనడం లేదు. ఇక తనకు కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని అందుకే వారిని తిట్టలేనన్నారు. రాష్ట్ర మంతా తిరిగి పరిస్థితులు చూడలేదు కాబట్టి తాను బీఆర్ఎస్ నేతలను తిట్టలేనన్నారు. కేవలం తెలంగాణ పోరాటాలను ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు. అందుకే పవన్ ప్రసంగాలు చప్పగా ఉంటున్నాయని, బోర్ కొడుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇరు పార్టీల నేతలు. మరికొంతమందైతే పవన్ ఎందుకు ప్రచారం చేస్తున్నారో ఆయనకే తెలియాలని విమర్శలు గుప్పిస్తున్నారు.