Saturday, April 27, 2024
- Advertisement -

జనసేన అభ్యర్థులు వీరే..

- Advertisement -

టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు పవన్. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా అనకాలపల్లి నుండి కొణతాల రామకృష్ణ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ,
రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ,తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు,
యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్,పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ,రాజోలు నుంచి దేవ వరప్రసాద్, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు.

అలాగే భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, పోలవరం నుంచి చిర్రి బాలరాజు, తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు నుంచి డా.యనమల భాస్కర రావు ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -