Monday, May 6, 2024
- Advertisement -

వైసీపీ దూకుడు..టీడీపీ లిస్ట్ మరింత ఆలస్యం!

- Advertisement -

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్ది అధికార వైసీపీ దూకుడు పెంచింది. ఇప్పటికే సగంకు పైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడమే కాదు ఎన్నికల రణక్షేత్రంలో దూసుకుపోతున్నారు జగన్. ఇక టీడీపీ -జనసేన కూటమి లిస్ట్ ఇదిగో, అదిగో అనడం తప్ప అడుగు ముందు పడటం లేదు. వాస్తవానికి ఈ నెల 8నే టీడీపీ – జనసేన లిస్ట్ పై అఫిషియల్ ప్రకటన ఉంటుందని భావించినా అలాంటిదేమీ జరగలేదు. ఎందుకంటే ఈ కూటమిలో బీజేపీ ఎంట్రీ ఇవ్వడమే.

తాజాగా అందిన సమాచారం ప్రకారం అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. జనసేనాని పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంది.

త్వరలోనే ఎన్డీయేలో కొత్త మిత్రులు చేరుతారంటూ..చంద్రబాబు చేరికకు సంబంధించిం అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయని… రాజకీయంగా ఎంత పెద్దకూటమి ఉంటే అంత మంచిదని తెలిపారు.తమ మిత్రులను తామెప్పుడూ బయటకు పంపించలేదని …ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని పార్టీలు బయటకు వెళ్లి ఉండవచ్చని చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -