Saturday, April 27, 2024
- Advertisement -

పవన్‌కు సవాల్‌గా విశాఖ సౌత్?

- Advertisement -

టీడీపీ -జనసేన – బీజేపీ కూటమిగా ఏపీలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ప్రకటించాయి. ఇక రేపో,మాపో బీజేపీ సైతం అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయనుండగా ఇక జనసేనాని 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా పెండింగ్‌లో ఉంచిన మూడు స్థానాల్లో ప్రధాన స్థానం విశాఖ సౌత్.

ఈ స్థానం నుండి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గండి బాజ్జీ పోటీ చేసేందుకు రెడీ కాగా ఈ సీటును జనసేనకు కేటాయించారు చంద్రబాబు. దీంతో పవన్ ఈ స్థానం నుండి మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణను బరిలోకి దించాలని భావిస్తుండగా గండి బాజ్జీ తనకు సీటు రాకుంటే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానని హెచ్చరిస్తున్నారు.

వాస్తవానికి జనసేనకు ఈ స్థానాన్ని కేటాయించనప్పుడే గండి బాబ్జీ టీడీపీకి రాజీనామా చేశారు. అయితే చంద్రబాబు బుజ్జగించిన బాబ్జీ మెత్తబడలేదు. టీడీపీకి కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక జనసేనలోనే వంశీకృష్ణకు పోటీ ఎదురవుతోంది. స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ మద్దతుదారులలో కలిసి టికెట్ తనకు ఇవ్వాలని రొడ్డెక్కారు. దీంతో జనసేనలో ఒక వర్గం వంశీకి, మరోక వర్గం సాదిక్‌కు అవకాశం కల్పించాలని పట్టుబట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సీటును పెండింగ్‌లో పెట్టారు పవన్. మొత్తంగా విశాఖ సౌత్ నుండి ఎవరు పోటీ చేస్తారు అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -