హీరోయిన్ కస్తూరికి తమిళ్ తో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా నటించి మంచి కేజ్ తెచ్చుకుంది. బాలకృష్ణ ‘నిప్పు రవ్వ’ , నాగార్జున ‘అన్నమయ్య’ ‘ఆకాశవీథిలో’, కమల్ హాసన్ ‘భారతీయుడు’, రవితేజ ‘డాన్ శీను’ వంటి చిత్రాల్లో కస్తూరి నటించింది. ప్రస్తుతం ‘స్టార్ మా’ లో టెలికాస్ట్ అవుతున్న ‘గృహలక్ష్మీ’ సీరియల్ లో లీడ్ రోల్ లో పోషిస్తోంది.
ఈమె ఎప్పుడూ ఎదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటుంది. ఇటీవల మూడో పెళ్ళి చేసుకున్న వనితా విజయ్ కుమార్ విషయంలో కూడా చాలా గొడవలు ఫేస్ చేసింది. అయితే ఈమె గతంలో ఓ బోల్డ్ ఫోటో షూట్ పాల్గొంది. ఆ ఫోటోలు పెద్ద ఎత్తున దుమారాన్నే రేపాయి. ఈ విషయంపై ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. మంచి పాత్రల్లో నటిస్తున్న సమయంలో… ఒక మ్యాగజైన్కు బోల్డ్ ఫొటో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అనే ప్రశ్నకు కస్తూరి జావాబిస్తూ…” ఇక్కడ నేను ఇవ్వలేదండీ…! అందరూ అనధికారికంగా వేసేసుకున్నారు.
అది ఓ అమెరికన్ ప్రాజెక్టు. మాతృత్వానికి వాళ్లు ఇచ్చే మర్యాద వేరు…మనం ఇచ్చే మర్యాద వేరు. ఆ ఫొటోలు లీక్ కావడం పట్ల నేను చాలా బాధ పడ్డాను.ఓ తల్లి బిడ్డకు పాలిచ్చే ఫొటోలను ఇక్కడి జనాలు వేరే విధంగా చూస్తుంటారు. తరువాత అది తప్పని రియలైజ్ అయ్యాను. చాలా మంది మహిళలు నన్ను సపోర్ట్ చేసారు. పల్లెటూరిలో ఉండే మహిళలు కూడా నాకు సపోర్ట్ చేసారు” అంటూ కస్తూరి చెప్పుకొచ్చింది.
హైపర్ ఆది మ్యానరిజం.. జెబులో చేయి ఎందుకు పెట్టాడు ?
అభిరామ్ నుంచి శ్రీరెడ్డి 6 కోట్లు తీసుకుందా ? శ్రీరెడ్డి ఏమన్నాదంటే ?