టాలీవుడ్లో సుధీర్ బాబు కొత్తరకం కథలతో సినిమాలు తీస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఇటు టాలీవుడ్లో హీరోగా చేస్తునే బాలీవుడ్లో కూడా చేస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్లో సుధీర్ బాబు అంటే ఎవరె తెలియదు. బాలీవుడ్ మూవీ ‘బాఘీ’ ట్రైలర్ విడుదలైన వెంటనే సుధీర్ బాబు ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు.
ఈ చిత్రంలో సుధీర్ బాబు విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్లో సుధీర్ బాబు అద్భుతమైన నటన కనబడుతుంది. ట్రైలర్లో సుధీర్ బాబు ని చూసి అసలు ఎవరీ సుధీర్ బాబు అని బాలీవుడ్ అంత ఆరాతీయడం స్టార్ట్ చేసింది. ట్రైలర్ రిలీజ్ కాగానే బాలీవుడ్ మీడియా దృష్టి ఇప్పుడు సుధీర్ బాబు వైపు మళ్లింది. ఈ సుధీర్ బాబు స్వయాన మహేష్ బాబుకు బావ అని తెలిసి బాలీవుడ్ షాక్ అయింది.
ట్రైలర్ రిలీజ్ కాగానే సుధీర్ బాబు ట్వీట్ చేశారు. ఎక్కడో బాలీవుడ్ లో ఓ ఛాలెంజింగ్ రోల్ కోసం వెతుక్కుంటూ ఓ తెలుగువాడిని తీసుకుపోయారు. మనం ఎవరికీ తక్కువ కాదు అంటూ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు అందరిలో హాట్ టాపిక్ అయింది. ‘బాఘీ’ సినిమాకి షబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
{youtube}v=8HQIKJBUsQk{/youtube}