మొన్న విశాఖపట్టణం.. నిన్న విజయవాడ.. నేడు హైదరాబాద్ ఇలా సూపర్ స్టార్ మహేశ్బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం వాయిదా పడిందని తెలుస్తోంది. అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉండడంతో.. పైగా ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేసే లాల్ బహదూర్ (ఎల్బీ) స్టేడియంలో ఈ ఆడియో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేశ్బాబు ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. అందుకే ఈ సినిమాను ఆడియో విడుదలను పత్ర్యేకంగా ఎల్బీ స్టేడియంలో విడదుల చేసే అవకాశం ఉంది. అయితే ఇది కూడా పుకారే. ఇంకా అధికారికంగా సమాచారం అందలేదు.
ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తవొచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయి ఏప్రిల్ 20వ తేదీన సినిమా థియేటర్లోకి రానుంది. ఆ సినిమా విడుదలకు ముందే మొదట వైజాగ్లో ఆడియో, ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించాలని భావించారు. తరువాత వేదికను విజయవాడకు మార్చినట్టుగా సమాచారం వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్లోనే నిర్వహించాలని ఫైనల్గా ఫిక్సయ్యారని తెలుస్తోంది.
భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యేందుకు వీలుగా ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం ఏప్రిల్ 7వ తేదీన ప్రీ రిలీజ్, ఆడియో విడుదల వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అని సమాచారం.