Friday, May 10, 2024
- Advertisement -

తార‌క్‌, చెర్రీ మ‌ధ్య‌లో బ‌న్నీ

- Advertisement -

రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ బ‌న్నీకి అవ‌కాశం?

ఒక్క ఫొటో చుట్టూ ఎన్నెన్నో వార్త‌లు, రూమ‌ర్లు, పుకార్లు వినిపిస్తున్నాయి. ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి గ‌త డిసెంబ‌ర్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి దిగిన ఓ ఫొటోను ఏమీ రాయ‌కుండా ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. అప్ప‌టి నుంచి ఈ ఫొటోపైనే చ‌ర్చంతా. అయితే చివ‌రికి తేలిందేమంటే ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌తో క‌లిసి రాజ‌మౌళి ఓ భారీ మల్టీస్టారర్ తీస్తున్నాడ‌ని. అయితే ఈ విష‌యం కూడా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.  ‘బాహుబలి’ సినిమాల తరువాత ఎస్‌.ఎస్‌ రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోల‌తో సినిమా చేస్తున్నార‌నే స‌మాచారంతో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే ఈ అంచ‌నాల‌కు మ‌రోటి చేర‌నుంది. ఇక ఈ సినిమా బాహుబ‌లులను మించి ఉండ‌నుంద‌ని ఈ విష‌యం వింటే మీరే అంటారు.

ఈ మ‌ల్టీస్టార‌ర్‌లో తార‌క్‌, చెర్రీనే కాకుండా మ‌రో హీరోకు అవ‌కాశం ఉందంట‌. మూడో పాత్ర‌కు ఓ హీరోను ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ పాత్ర‌కు అల్లుఅర్జున్‌ను ఎంపికచేసినట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బన్నీది కీలక పాత్ర అని తెలుస్తోంది. బ‌న్నీని ఎంపిక చేసుకున్న చేసుకోవ‌చ్చు. ఎందుకంటే రుద్ర‌మదేవి సినిమాలో అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయాడు. ఇక రాజ‌మౌళి సినిమా అంటే కాదంటాడ‌.

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. స్క్రిప్ట్‌ పక్కాగా కుదిరిన తరువాత సినిమా, నటీనటుల వివరాలు వెల్ల‌డించే అవ‌కాశం ఉంది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో నటిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రంతో బిజీగా ఉన్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సమంత కథానాయికగా నటిస్తున్నారు. ఇక తారక్‌..త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -