మీలో ఎవరు కోటీశ్వరుడు కొత్త ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి యాంకర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 13న చిరంజీవి యాంకర్ గా చేసిన ఈ ప్రోగ్రామ్ ప్రసారం అయ్యింది. అయితే ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మొదటి అభ్యర్థే కోటీ రూపాయలను టచ్ చేశారని సమాచారం.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కవంతల గూడెం గ్రామానికి చెందిన ఉస్లేల సోమిరెడ్డి కోటీ రూపాయలను టచ్ చేసి చిరుని షాక్ చేసాడట. సోమిరెడ్డి ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో సూపరింటెండెంట్ పని చేస్తున్నారు. ఈ షోకి వచ్చినందుకు సోమిరెడ్డిలోకి వచ్చి కోటి ప్రశ్న వరకు వెళ్లడని తెలుస్తోంది. అయితే కోటీ ప్రశ్నకు సరైన జవాబు వద్ద ప్రోగ్రంలో వివాదం జరిగినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ అడిగిన కోటి రూపాయల ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ సరైనవి కాదని సోమిరెడ్డి స్పష్టం చేశారట. దాంతో నిర్వాహకులు ఆ ప్రశ్నను రిజర్వులో ఉంచినట్టు చెపుతున్నారు. మరి ఇంకో కోటీ రూపాయల ప్రశ్న అడిగారా..? సోమిరెడ్డి ఎంత తీసుకెళ్ళాడు…? అనేది రహస్యంగా ఉంచారు.
సో చిరంజీవి ఫస్ట్ టైం చేస్తున్న ఈ ప్రోగ్రాంలో సోమిరెడ్డి కోటీ రూపాయల వరకు వెళ్లడం విశేషమే. ఈ విషయం కాస్త పక్కన పెడితే.. చిరు యాంకర్ గా చేస్తున్న ఈ ప్రోగ్రాం ద్వారా అందరూ సంతృప్తి పడటం లేదని అంటున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ఈ షోని నాగ్ చేసేవారు. నాగ్ చాలా సరదా గా.. యాక్టివ్ గా.. ప్రశ్నలను అడిగే విధనంలో ఆసక్తి బాగుంటుంది. నాగ్ ఆ ఆసక్తిని అందరిలో సృష్టించాడు. కానీ చిరు ఆ సందడి అంతా మిస్ చేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగ్ చేసిన స్థాయిలో చిరు ప్రశ్నలను అడిగే విధానం లేదని అంటున్నారు. సో మొత్తానికి నాగ్ ని యాంకరింగ్ లో చిరు భర్తీ చేయలేకపోయాడనే కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి.
Related