కంగనా రనౌత్ కీలక పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మణికర్ణిక’. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఈ సినిమాకు సంబంధించిన సినీ ప్రియుల్లో ఎన్నో అనుమానాలున్నాయి. ఈ సినిమా షూటింగ్లో కంగన-క్రిష్ మధ్య జరిగిన వివాదం ఏమిటి?‘మణికర్ణిక’ దర్శకత్వాన్ని ఉద్దేశిస్తూ అప్పట్లో కంగన ఎందుకు అలా ట్వీట్ చేశారు?.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు తాజాగా క్రిష్ సమాధానం చెప్పాడు. ఆహా ఓటీటీలో సమంత నిర్వహించే టాక్ షోకు అతిథిగా వచ్చిన క్రిష్ ఆ వివాదంపై వివరంగా మాట్లాడాడు. తన కెరీర్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు.
‘91 రోజుల పాటు మేమంతా ఎంతో సంతోషంగా ‘మణికర్ణిక’ షూటింగ్ పూర్తి చేశాం. షూట్ జరుగుతుండగా కంగనకు, నాకూ మధ్య ఎలాంటి సమస్యలు రాలేదు. అంతా ఎంతో సంతోషంగా సాగిపోయింది. రీరికార్డింగ్ జరుగుతున్నపుడు కంగన టీమ్ వచ్చి సినిమా చూశారు. ఫస్ట్ హాఫ్ వాళ్లకి బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ కూడా బాగుందని చెప్పారు. కానీ కొన్నిరోజులు గడిచిన తర్వాత కంగన టీమ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. కొన్ని సన్నివేశాలు నచ్చలేదని, కొన్నిచోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలేదని చెప్పారు.
నేను షూట్ చేసిన దాని ప్రకారం సోనూసూద్ పోషించిన ‘సదాశివ్’ పాత్ర సెకండ్ హాఫ్లో చివరి 20 నిమిషాల వరకూ ఉంటుంది. కానీ అది వాళ్లకు నచ్చలేదు. సదాశివ్ పాత్రను ఫస్ట్హాఫ్తోనే ముగించమని చెప్పారు. అది నా వల్ల కాదని ఎందుకంటే ‘మణికర్ణిక’ ఒక చారిత్రాత్మక చిత్రమని చెప్పాను. తన పాత్రను తగ్గించడానికి సోనూ కూడా ఒప్పుకోలేదు. ఇదే విషయాన్ని సోనూ కంగనాకు ఫోన్ చేసి చెప్పాడు. అందుకామె.. ‘క్రిష్ రీషూట్ చేయకపోతే నేను చిత్రీకరిస్తాను’ అని సమాధానమివ్వడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత వాళ్లే రీషూట్ చేసుకున్నారు. నా బాధ ఏమిటంటే.. నేను అనుకున్న, తెరకెక్కించిన కథను ప్రజలకు చూపించలేకపోయాను’ అని క్రిష్ తెలిపాడు.
రొమాన్స్ను చాలా మిస్ అవుతున్నా: స్టార్ హీరోయిన్