Friday, May 17, 2024
- Advertisement -

మహేష్ చేసిన పనికి బాధపడుతున్న మహేష్ ఫాన్స్

- Advertisement -

మహేష్ బాబు ఎంచుకునే సబ్జెక్ట్ లు చాలా బాగుంటాయి అని పేరుంది, ఆయన సినిమాలు ఒక్కడు దగ్గర నుంచీ చూసుకుంటే ఒక్కొక్క సినిమాకీ వ్యత్యాసం చూపిస్తూ వచ్చారు. ఆయన ఆహార్యం , డిక్షన్ , మాటలో కూడా మహేష్ తన సత్తా చాటుకుంటాడు మహేష్. ఆ మధ్య మనం సినిమా చూసిన మహేష్ ఆ దర్శకుడి ప్రతిభకి పొగడకుండా ఉండలేకపోయాను అంటూ ట్వీట్ చేసాడు.

ఆ తరవాత కొన్నాళ్ళకి మహేష్ ని పర్సనల్ గా కలిసిన విక్రమ్ కుమార్ ఒక వినూత్నమైన కథ ని చెప్పాడు . ఆ కథ బాగా నచ్చిన మహేష్ బాబు ఫస్ట్ హాఫ్ తెగ నచ్చినా సెకండ్ హాఫ్ తనకి సెట్ కాదు అని మిన్నకుండిపోయాడు. అదే కథని సూర్య కి వినిపించిన విక్రం వెంటనే స్క్రిప్ట్ ని పూర్తిగా సిద్దం చెయ్యమని మనిద్దరం ఆ సినిమాని చేస్తున్నాం అని తమిళ సూర్య మాట ఇవ్వడంతో ఆ పనిలో పడ్డాడు విక్రం.

కొన్నాళ్ళ తరవాత ఆ సినిమా షూటింగ్ మొదలైంది, ఇప్పుడు ఆ చిత్రం విడుదల కి కూడా సిద్దమయ్యింది 24 గా మనముందుకు రాబోతున్న ఈ సినిమా త్వరలో విడుదల కి సిద్దం అవుతోంది. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి, కాగా ఇలాంటి ఒక మంచి సినిమాని మహేష్ ఎందుకు ఒడులుకున్నాడో అర్ధం కావడం లేదు అంటున్నారు అభిమానులు.

బహుసా సెకండ్ హాఫ్ లో వచ్చే కిల్లర్ క్యారెక్టర్ తనకి నప్పదు అని మహేష్ అనుకుని ఉండచ్చు. సూర్య సరసన సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చారు.  ఏదేమైనా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు మా హీరో అనుకుంటున్నారు మహేష్ ఫాన్స్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -