ప్రస్తుతం ఉన్న షోస్ లో జబర్దస్త్ నెంబర్ వన్ ప్లేస్ తో దూసుకెళ్తోంది. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్స్గా మారారు. అయితే ఈ జబర్దస్త్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న పొట్టి రమేష్ భార్య త్రిపురాంబిక ఆత్మహత్య చేసుకుంది. గాజువాకలోని శ్రీనగర్లో ఈ ఘటన జరిగింది.
పెళ్లి జరిగిన ఏడాదికే త్రిపురాంబిక ఆత్మహత్య చేసుకోవడంతో పలు ఆరోపణలు వినబడుతున్నాయి. పొట్టి రమేష్.. షూటింగ్ కోసం మూడు రోజుల క్రితమే హైదరాబాద్ వెళ్లిన టైంలో త్రిపురాంబిక ఈ పనికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న పొట్టి రమేష్ వెంటనే విశాఖపట్టణం చేరుకున్నాడు. తాము వివాహం జరిగినప్పటి నుంచి చాలా అనందా ఉన్నమని… మా మధ్య ఎలాంటి గొడవలు లేవని తెలిపాడు. కేసు నమోదు చేసి పొట్టి రమేష్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
త్రిపురాంబిక ఆత్మహత్యకు ఇష్టంలేని పెళ్లా, లేక అత్తమామల వేధింపేలేమైనా కారణమా అనే విషయాలపై విచారణ చేపట్టారు పోలీసులు. త్రిపురాంబిక మృతివార్త తెలియాగానే ఆమె తల్లిదండ్రులు, బంధువులు విశాఖకు చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అత్త, ఆడపడుచులే అని త్రిపురాంబిక తల్లి అంటుంది. తమ కుమార్తె ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని త్రిపురాంబిక తల్లి ఆరోపించారు. ఈ కేసు ను నిష్పాక్షింగా విచారణ జరిపించాలని మహిళా సంఘం నేత ప్రభావతి డిమాండ్ చేశారు.
Related