Saturday, April 27, 2024
- Advertisement -

మహేష్ తో మరో సినిమా!

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు బంఫర్ హిట్స్ కొట్టాయి. పోకిరితో రికార్డ్ సృష్టించిన మహేష్, పూరి ఆ తర్వాత బిజినేస్ మెన్ సినిమాతో వచ్చారు. బిజినేస్ మెన్ కూడా పోకిరికి ఏ మాత్రం తీసిపోకూడా తీసాడు పూరి. సో బిజినేస్ మెన్ కూడా పోకిరి రెంజ్ లో మంచి విజయం సాధించింది. అయితే ఇటివలే పూరి పోకిరి సినిమా విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా  మహేష్ తో మరో సినిమా ఎనౌన్స్ చేశాడు.

ఆ సినిమాకు జనగణమన అనే టైటిలి ఫిక్స్ చేసి… ఓ చిన్న పోస్టర్ కూడా విడుదల చేశాడు. దీంతో మహేష్ అభిమానులు పండగ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ టైటిల్ పై కొంత చర్చ జరుగుతుంది. సరిగ్గా ఇదే టైటిల్ తో దిల్ రాజు ఓ సినిమా చేయాలనుకున్నాడు. అది కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో. తన బ్యానర్ పై గతంలో ఈ టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయించాడు రాజు. అయితే ఏళ్లు గడుస్తున్నా పవన్ మాత్రం దిల్ రాజుతో సినిమా చేయలేకపోయాడు. సో దిల్ రాజ్ చేయాలి అనుకున్న సినిమా టైటిల్ పూరి జగన్నాధ్ వద్దకు వచ్చింది.

అయితే… కేవలం టైటిల్ మాత్రమే పూరి వద్దకు వచ్చిందా… లేక కథ కూడా దిల్ రాజు నుంచి పూరీకి ట్రాన్స్ ఫర్ అయిందా అనే విషయం తేలాల్సి ఉంది.గతంలో రెండుసార్లు జనగణమన కథను పవన్ కల్యాణ్ విన్నాడట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టులో నటించలేకపోయాడు. అప్పట్నుంచి ఇప్పటివరకు దిల్ రాజు, పవన్ తో సినిమా నిర్మించలేకపోయాడు. సో… ఈ నేపథ్యంలో… అదే టైటిల్ తో మహేష్ బాబుతో సినిమా ఎనౌన్స్ చేశాడు పూరీ జగన్నాధ్. గతంలో పూరి పవన్ కు చెప్పిన ఎన్నో స్టీరిలను వేరే హీరోలతో తీసి హిట్స్ కొట్టాడు. మరి ఈ సినిమా కూడా అదే సెంటిమెంట్ ప్రకారం సూపర్ హిట్ అవుతుందా అనేది చూడాలి. మహేష్ ఫ్యాన్స్ మాత్రం మా హీరో ఇంక కథ వినలేదు అని అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -