Thursday, May 9, 2024
- Advertisement -

మంచు లక్ష్మిని మళ్లీ ట్రోల్ చేస్తున్న నెటిజెన్లు.. ఎందుకంటే?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీ డైలాగ్ కింగ్,సీనియర్ నటుడు మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ మంచు ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో స్పందించి ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉంటారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కరోనా బారినపడగా క్వారంటైన్ లో ఉన్న మంత్రికి తన సినిమాలు చూడమంటూ సలహా ఇవ్వడంతో ఈమెను నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు.

ఈ క్రమంలోనే తనపై వచ్చిన ట్రోలింగ్ కు కాస్త సీరియస్ అయ్యిన మంచు లక్ష్మి ఇలాంటి నెగిటివిటీని నేను పట్టించుకోను అంటూ రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి మొదటి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాల పైబడిన వారందరూ వ్యాక్సిన్ తీసుకుని జాగ్రత్తగా ఉండాలని. కరోనాను తరిమివేయడానికి మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సిన్ అంటూ తెలిపారు.

Also read:‘టాలీవుడ్’లో ఎవర్ గ్రీన్ ప్రేమ కథ చిత్రాలు ఇవే!

యశోద హాస్పిటల్ లో తాను మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపిన మంచు లక్ష్మి పై తీవ్రస్థాయిలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం మొదటి డోసు వ్యాక్సినేషన్ వేయడం నిలిపివేసింది. కేవలం రెండో డోస్ వేస్తున్న నేపథ్యంలో తనకు మొదటి డోస్ వ్యాక్సిన్ ఎలా వచ్చింది అంటూ ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు.

Also read:వామ్మో.. అల్లరి నరేష్ సినిమాలో దారుణమైన బూతులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -