టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో కనిపించి తర్వాత యాంకర్ గా రాణిస్తుంది తెలుగు అమ్మడు యాంకర్ మంజూష. చక్కటి ముఖ కవళికలు, అందం అభినయం ఉన్నటువంటి సినిమాల్లో ప్రస్తుతం నటించడం లేదు. కేవలం యాంకర్ గానే చేస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అందుబాటులో ఉంటుంది.
అయితే ప్రస్తుతం ఈ అమ్మడు లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. అందుకే ఆరోగ్యానికి యోగ మరియు జిమ్ చాలా అవసరం కాబట్టి యోగ మరియు జిమ్ చేస్తూ తీవ్రంగా శ్రమిస్తోంది. అంతేగాక అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అయితే ఈ అమ్మడు షేర్ చేసిన కొద్దిసేపట్లోనే బాగానే లైకులు కామెంట్లు వచ్చాయి.అంతేగాక మరి కొందరు అయితే సినిమాల్లో హీరోయిన్ గా ట్రై చేయొచ్చు కదా అంటూ యాంకర్ మంజూషాకి సలహాలు ఇస్తున్నారు.
అయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించినటువంటి రాఖీ చిత్రంలో హీరో చెల్లెలి పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది మంజూష. అయితే ఆ తరువాత అడపాదడపా చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తుండిపోయే పాత్రలు రాలేదు. అందుకే యాంకర్ గా సెటిల్ అయింది. ఈ మధ్య కాలంలో వరుస ఫోటో షూట్లతో కొంత గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది. మరి లుక్ మార్చిన మంజూష ను చూసి దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తారేమో చూడాలి.