నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాపై ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ప్రస్తుతం బాలయ్య 100వ చిత్రంలో మోక్షజ్ఞ ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడు. అయితే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం వచ్చే ఏడాది సెట్స్మీదకు వెళ్లనుంది.
అయితే మరి మోక్షజ్ఞ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంక కన్ఫార్మ్ కాలేదు. కాకపోతే సాయి కొర్రపాటి వారాహి చలనచిత్ర పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ చిత్రాన్నికి స్టోరీ కూడా రెడీ అయ్యిందని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. బాలయ్యతో గతంలో ఆదిత్య 369 లాంటి సినిమా తీసారు సింగీతం శ్రీనివాసరావు. ఈ ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ తీసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
వాస్తవానికి ఈ స్టోరీతోనే బాలయ్య వందో సినిమా తెరకెక్కుతుందని అందరూ అనుకున్నారు. బాలయ్య వందో చిత్రంగా గౌతమీపుత్ర శాతకర్ణి ఒప్పుకోవడంతో ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షజ్ఞ ఎంట్రీ మూవీని తెరకెక్కించాలని బాలయ్య డిసైడ్ అయ్యాడట. ఇక సింగీతం కూడా మోక్షజ్ఞకు తగ్గట్లుగా కథను రెడీ చేస్తున్నారట. ఈ విషయంపై సింగీతం స్పందిస్తూ తాను రాసుకున్న కథను ఎప్పుడు తెరకెక్కించినా తాజా అనుభూతిని ఇస్తుందని ఆయన తెలిపారు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ మూవీకి సింగీతం స్టోరీతో ఆదిత్య 999 సినిమా రెడీ అయినట్టే అనుకోవాల్సిందే.
Related