టాలీవుడ్ లో అక్కినేని అఖిల్ పెళ్లి ఆగిపోయిందంటూ భారీ ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే అఖిల్ నిశ్చితార్ధం శ్రేయా భూపాల్ తో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి కూడా రోమ్ లో చేయడానికి నాగార్జున అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 100 మంది వరకు రోమ్ వెళ్లడానికి ప్లాన్ చేశారు. కానీ ఇంతలో ఏం జరిగిందో ఏమో పెళ్లి రద్దు చేసుకోవాలనే ఇరు కుటుంబ సభ్యులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు అఖిల్-శ్రియ భూపాల్ ల ఎంగేజ్మెంట్ రద్దు అయినట్లు దాదాపుగా కన్ఫమ్ అయిపోయిన క్రమంలో ఇప్పుడందరి ఫోకస్ చైతూ-సమంతల మీద పడింది. వీరి బంధం వేరన్న సంగతి అర్థమవుతున్నా.. అఖిల్ విషయంలో జరిగింది చూసి వీరి వైపు కూడా జనాలు అనుమానంగా చూసే పరిస్థితి వచ్చింది. దీంతో వీళ్లు సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలన్న ప్రెజర్ ఎదుర్కొంటున్నారు. నాగ్ ఆలోచన కూడా అలాగే ఉందట. పెళ్లి సాధ్యమైనంత వరకు నిరాడంబరంగా చేసుకోవాలని చైతూ సమంత అనుకున్నారు. కానీ.. ఇప్పుడు అలా కుదిరేట్లు లేదు.
ఈ పెళ్లిని గ్రాండ్ గా చేసి.. అఖిల్ ఉదంతాన్ని అందరూ మరిచిపోయేలా చేయొచ్చని అక్కినేని కుటుంబం భావిస్తున్నట్లు సమాచారం. అఖిల్ పెళ్లి అనుకున్న సమయానికే చైతూ-సామ్ పెళ్లి అయిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు. మొత్తానికి అఖిల్ పెళ్లి ఆగిపోవడంతో జాలీగా ఎంజాయ్ చేస్తున్న చైతూ-సమంతలకు టెన్షన్ పట్టుకుంది.
Related