మెగాస్టార్ చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా మొదటిసారి బుల్లితెర ఫై హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడని న్యూస్ వచ్చిన దగ్గరినుండి ఆ షో ఫై అంతటా ఆసక్తి మొదలయ్యింది. దీంతో స్టార్ టీవీ యాజమాన్యం కూడా రికార్డు స్థాయిలో రేటింగ్ వస్తుందని ఎంతో ఆశ పడింది. అందుకు తగ్గట్టుగానే ప్రోగ్రాం కూడా ప్రమోషన్ బాగా చేశారు.
చిరుకి 75 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చి ప్రోగ్రాంను మొదలు పెట్టారు. ఇక్కడే కధ అడ్డం తిరిగింది. ప్రస్తుతం ఆ షోకి వస్తున్న రేటింగ్స్ చూసి షాక్ అవుతున్నారట స్టార్ టీవీ వాళ్లు. మొదటి ఎపిసోడ్ లోనే బొక్కబోర్లా పడ్డ ఈ ప్రోగ్రాం ఆ తర్వాత ఎపిసోడ్ లకు కూడా 3 , 4 రేటింగ్స్ తోనే సరిపెడుతోందట. నాగ్ ఉన్నప్పుడు ఉన్న రేటింగ్ లో ఇది సగానికి సగం పడిందని చెప్పవచ్చు.
సాధారణ సీరియల్సే 6 నుండి 9 వరకు రేటింగ్స్ సాదిస్తుంటే మీలో ఎవరు కోటీశ్వరుడు మాత్రం ఇంత తక్కువ సాధించడం ఏంటి అని బిత్తరపోతున్నారట. చిరు ఎక్కువ శాతం సినిమాలకు సంబంధించిన ప్రశ్నలే అడుగుతుండడం, అవి కూడా మెగా ఫ్యామిలీకి సంబదించిన ప్రశ్నలే అడుగుతుండడంతో ఈ రేటింగ్ వస్తోందని భావిస్తున్నారట. దీంతో చిరు షో ఫ్లాప్ అన్న టాక్ ని మూటగట్టుకుంటోంది. తక్కువ రేటింగ్ వస్తే తమకు బాగా లాస్ వస్తుంది కాబట్టి ఈ షో నుండి చిరు తప్పించి, మళ్లీ నాగ్ నే పెట్టుకునేందుకు ప్లాన్ కూడా వేస్తోందట స్టార్ యాజమాన్యం.
{youtube}v=SA3WNXHt8mI{/youtube}
Related