Saturday, May 4, 2024
- Advertisement -

బెడ్ సీన్స్ చేయమని అడిగారు : నిహారిక

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల.. ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా ప్లాప్ కావడంతో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. గతేడాది వచ్చిన సూర్యకాంతం సినిమా ప్లాప్ అయింది. ఇక సైరాలో గిరిజన యువతి పాత్రలో నటించింది. ఇప్పుడు ఈమె ఆచితూచి చిత్రాలు ఎంపిక చేసుకుంటున్నట్లు కన్పిస్తుంది.

అయితే తాజాగా నిహారికకు తమిళం నుంచి ఒక ఆఫర్ వచ్చిందట. అయితే ఆ పాత్రలో గ్లామర్ అండ్ రొమాంటిక్ డోస్ ఎక్కువగా ఉందని నో చెప్పేసిందట. బోల్డ్ బెడ్ సీన్ లో నటించడం సినిమాలో అవసరమే.. కానీ తన బ్యాక్ గ్రౌండ్ కారణంగా ఆ ఆఫర్ వదులుకుందని ఫిల్మ్ నగర్ లో టాక్. ఇక చిరు నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా నిహారిక ఓ పాత్రలో కనిపించనుందట. నిహారిక తాజాగా ఓ తమిళ చిత్రానికి నిహారిక సంతకం చేసిందట.

జాతీయ పురస్కార గ్రహీత సుశీంద్రన్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన స్వాతిని అనే అమ్మాయి దర్శకురాలిగా పరిచయమవుతున్న మూవీలో నిహారిక కథానాయికగా కనిపించనుందట. ఇందులో ‘పిజ్జా’ ఫేమ్ అశోక్ సెల్వన్ కథానాయకుడు. ‘‘అవును. తమిళ చిత్రం చేస్తున్నా. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్నా’’ అని నిహారిక అన్నారు. రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాని తీస్తున్నారట. తమిళంలో నిహారికకు రెండో చిత్రమిది. ఇంతకుముందు ఈమె విజయ్ సేతుపతి సరసన ‘ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్’ చేశారు. ఇక ఇటీవలే గ్లామర్ పాత్రలు కూడా చేయడానికి రెడీ అని చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -