టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే.. ఆ సినిమా మీద భారీ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే పవన్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. పవన్ సినిమా డైరెక్టర్ ఎవరైన సరే.. అందులో పవన్ ఉంటే.. ఆ సినిమాపై భారీ అంచనాలు ఉండాల్సిందే.
ఇక పవన్ 25వ సినిమా పై ఏ రెంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందులోను ఈ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తుండటం విశేషయం. వీరి కాంబోలో వచ్చిన జల్సా, అత్తరింటికి దారేది సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఈ చిత్ర కథ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇందులో పవన్ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా కనిపిస్తూనే.. హత్యలు కూడా చేస్తుంటాడు. పవన్ ప్రేమించే అమ్మాయిగా కీర్తిసురేష్ నటిస్తుండగా.. అను ఎమ్మాన్యువల్ జర్నలిస్ట్ గా నటిస్తుంది. ఇంటర్వెల్ టైమ్ కు పవన్ ఎందుకు హత్యలు చేస్తుంటాడనే విషయం తెలుస్తుంది. సమాజానికి చెడు చేసే వాళ్లను అజ్ఞాతవాసంలో ఉంటూ పవన్ వాళ్లను చంపేస్తుంటాడు.
భారతంలో అర్జునుడు, కృష్ణుడు మధ్య అజ్ఞాతవాసం కాన్సెప్ట్ ఇది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు పవన్ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. అందుకే ఈ సినిమాకి అజ్ఞాతవాసి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. దానికి తగ్గట్లే కాన్సెప్ట్ పోస్టర్ లో ఒక్కడే ఎక్కడికో వెళ్లిపోతున్నాడు పవర్ స్టార్. ఇదంతా సెటప్ చూస్తుంటే అజ్ఞాతవాసి అవుతున్నాడేమో అనిపిస్తుంది మరి.