Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్ సినిమా కోసం అతడిని వెతుకుతున్నారు!

- Advertisement -

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసింది. ఈ సినిమాని రభస వంటి సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీనివాస్‌ దర్శకత్వం వహించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజా సమచారం ప్రకారం ఇంకా ఈ సినిమాకి ఏ దర్శకుడిని ఫిక్స్ చేయలేదట.

తమిళంలో ‘వేదాళం’ సినిమాని ఏ ఎం రత్నం నిర్మించారు. తెలుగులో కూడా ఆయనే నిర్మిస్తున్నారు. ఐతే రిసెంట్‍గా రత్నం పవన్ కళ్యాణ్‍తో వేదాళం రీమేక్ గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. పవన్ కూడా ఈ రిమేక్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిడట. ఐతే ప్రస్తుతం చేస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ కాంప్లీట్ అవ్వగానే ఈ సినిమాకి డేట్లు ఇవ్వానున్నాడు.

ఐతే ఈ సినిమాకి దర్శకుడిని ఇంక తీసుకోలేదట. త్వరలోనే ఈ రిమేక్ సినిమాకి న్యాయం చేసే దర్శకుడిని తీసుకోబోతున్నారు. ప్రస్తుతం పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్‍లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్‌ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -