2020లో సరిలేరు నికెవ్వరూ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు… కరోనా కారణంగా మళ్లీ కనిపించలేదు. అయితే, ప్రస్తుతం సర్కారు వారి పాట అనే చిత్రాన్ని పూర్తి చేయడంలో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యుల్ ను దుబాయిలో పూర్తి చేశాడు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి ఇదివరకు ప్రకటించిన వచ్చే సంక్రాంతికి షెడ్యుల్ కు విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.
ఇక సర్కారు వారి పాట సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి దర్శకత్వం లో రానున్న సినిమాలో మహేష్ నటించనున్నారు. ఇప్పటికే మహేష్ తో పాటు రాజమౌళి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సనిమా పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షెడ్యుల్ మారిపోంది.
ఈ క్రమంలో త్వరలోనే సర్కారు వారి పాట పూర్తి అయితే.. మహేష్ తో రాజమౌళి తీయబోయే సినిమాకు కథను రెడీ చేయడం, దాని ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడానికి కనీసం ఏడాది సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో మధ్యలో వస్తున్న గ్యాప్ లో మరో సినిమాచేయడానికి మహేష్ సిద్ధమవుతున్నారని టాక్. ఇప్పటికే పలువురు దర్శకుల స్టోరీలు విన్న మహేష్ కు అవి నచ్చాయని సమాచారం. తాజాగా అనిల్ రావిపూడి వినిపించిన కథ ప్రిన్స్ తెగ నచ్చిందట. ఆయనతో కలిసి ఓ ప్రయోగాత్మక చిత్రం చేయబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
షాదీ ముబారక్ అంటున్న దిల్ రాజు !
‘అన్నాతే’ షూటింగ్ లో సూపర్ స్టార్ రజినీ