Thursday, May 16, 2024
- Advertisement -

ఎన్టీఆర్ విషయంలో జగన్ ఎందుకు సైలెంట్ అయ్యాడు..?

- Advertisement -

మాములుగా పూరి జగన్నాథ్‌ కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉంటాడన్న విషయం తెలిసిందే. ‘జై లవకుశ’ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు మాత్రం ‘జై’ క్యారెక్టర్‌ తను చెప్పిన స్టోరీలోంచి కాపీ కొట్టారని ఆరోపించాడు. ఎన్టీఆర్‌ని అంత మాట అనేసి మళ్లీ దాని గురించి జగన్‌ ఎక్కడా వివరణ కూడా ఇవ్వలేదు.

పైసావసూల్‌ సినిమా ఇంటర్వ్యూల్లో కూడా ఆ టాపిక్ రానివ్వలేదు. జై లవకుశ రిలీజ్ అయిన ఇన్ని రోజులకి కూడా ఇంకా పూరి జగన్నాథ్ నుంచి ఈ విషయంపై వివరణ లేదు. అసలు ఈ సినిమా పూరి చూశాడా.. చూస్తే ఇది తను చెప్పిన స్టోరీలోంచి కాపీ కొట్టిన క్యారెక్టరేనా అన్నది పూరి చెప్పనే లేదు. ఈ సినిమాకి మాత్రం జై పాత్రే హైలైట్ అయి, ఇంతవరకు వచ్చిన వసూళ్లకి ఇదే ప్రధాన కారణంగా నిలించింది. ఈ మూవీకి వచ్చిన టాక్ ఎక్కువ నష్టమే వస్తుందని అనుకున్నారు. కానీ ఫైనల్ గా జై లవకుశ స్వల్ప నష్టాలతో గట్టెక్కిపోతుంది.

బాబీ లాంటి పెద్ద క్రేజ్ లేని దర్శకుడితో చేసిన యావరేజ్‌ సినిమాని కూడా ఎన్టీఆర్‌ ఇంత దూరం లాగేసరికి అతడి పట్ల ట్రేడ్‌లో మరింత నమ్మకం పెరిగింది. ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా చేసినట్లయితే దాని రిజల్ట్ మెరుపులు మెరిపుస్తుండనే కామెంట్స్ ట్రేడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -