టాలీవుడ్ లో ఈ మధ్య రాజ్ తరుణ్.. యాంకర్ లాస్య పెళ్లి చేసుకున్నారన్న రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరికీ ఎలా లంకె కుదిరిందో ఎవ్వరికీ తెలియదు. అయితే వీరిద్దరు క్లోజ్ గా దిగిన ఓ ఫొటో చూసి.. అలాగే నిప్పు లేనిదే పొగ రాదు కదా అనే లాజిక్ ప్రకారం ఆలోచించి జనాలు ఇది నిజమే అనుకున్నారు.
కానీ ఇదంత అబద్దమని రాజ్ తరుణ్.. లాస్య ఇద్దరూ కూడా కన్ఫమ్ చేశారు. అయితే ఈ రూమర్ ఎలా వచ్చిందో లాస్య క్లియర్ గా చెప్పింది. ఓ ఆడియో వేడుకలో తీసిన సెల్ఫీలోంచి నటుడు నోయల్ ను తప్పించి.. తమ ఇద్దరినీ మాత్రమే పెట్టి ఇలా దుష్ప్రచారం చేశారని ఆమె చెప్పింది. ఇక రాజ్ తరుణ్ కూడా ఈ విషయం వివరణ ఇచ్చాడు. లాస్యతో పెళ్లి రూమర్ వచ్చినప్పుడు ఎంతో బాధపడ్డానని.. ఆ టైంలో ప్రెండ్స్ కూడా ఆ రూమర్ నిజమని నమ్మి.. తనకు ఫోన్ చేసినట్లు రాజ్ తరుణ్ తెలిపాడు.
లాస్యతో లేచిపోయి వస్తే పెళ్లికి తాము సాయం చేస్తామని కూడా కొందరు ప్రెండ్స్ అన్నారని వివరించాడు. అందరికీ ఈ వార్త అబద్ధమని అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ఇబ్బందయిందని రాజ్ తరుణ్ తెలిపాడు. లాస్యను ‘కుమారి 21 ఎఫ్’ ఆడియో వేడుకలో తప్ప మళ్లీ ఎప్పుడు కలవలేదని.. అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని రాజ్ తరుణ్ క్లియర్ గా చేప్పేశాడు. ఆ వేడుకలో దిగిన ఫోటో వల్ల ఇంత రచ్చ జరిగిందని తెలిపాడు.
{youtube}NbT26usvihs{/youtube}
Related