రజనీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నరోబో 2.0 టీజర్ రెడీ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.సినిమాను గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో చిత్రాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ట్రైలర్,కాని టీజర్ కాని రిలీజ్ చేయలేదు.అయితే ఈ సినిమా టీజర్ విడుదలకు రంగం సిద్ధం అయింది.ఐపీఎల్-11 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రజనీ రోబో 2.0 సినిమా టీజర్ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.
ఇప్పటికే రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ ఫస్ట్ లుక్లకు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో టీజర్ను అంతకు మించిన రేంజ్తో తీర్చిదిద్దే పనిలో ఈ టీజర్ మరింత ఆలస్యమైంది.టీజర్ విడుదలకు దర్శకుడు శంకర్తో పాటు,హీరో రజనీకాంత్,అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్లు వస్తారని సమాచారం.మరోపక్క ‘కాలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రజనీకాంత్.