దర్శక ధీరుడు రాజమౌళి భారీ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు.ఇంకా కథ సిద్ధం కాకపోయిన రాజమౌళి మీద ఉన్న నమ్మకంతో సినిమాను ఒప్పుకున్నారు రాంచరణ్, ఎన్టీఆర్.ప్రస్తుతం సినిమా కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు రాజమౌళి.అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
రాజమౌళి రాసుకుంటున్న కథలో రాంచరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనే టాక్ వినబడుతుంది.అలాగే ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది.ఎన్టీఆర్ చేసే ఆగాడాలను కట్టడి చేసే పాత్రలో రాం చరణ్ కనిపిస్తాడని సమాచారం. ఇద్దరూ సోదరులే అయినప్పటికీ వాళ్లు ఎంచుకున్న మార్గాలు వేరు.
ఈ పరిస్థితుల్లో చోటుచేసుకునే పరిణామాలతో కథ చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో రాజమౌళియే చెప్పాలి.ఈ భారీ మల్టీస్టారర్ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.ఈ సినిమా వచ్చే ఏడాదికి విడుదల చేయలని ప్లాన్ చేస్తున్నారు.