యంగ్రెబల్ స్టార్ ప్రభాస్-కొరటాల శివ కాంబినేషన్లో తొలి సినిమాగా మిర్చి నిర్మించారు యూవీ క్రియేషన్స్ సంస్థ. ఆ తర్వాత రన్ రాజా రన్, భలే భలే మగాడివోయ్, ఎక్స్ ప్రెస్ రాజా వంటి చిత్రాలతో విజయవంతంగా తన ప్రస్థానాన్ని టాలీవుడ్లో కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సంస్థ ఇద్దరు బడా హీరోలతో పెద్ద సినిమాలు చేయనుందని తెలుస్తోంది.
అందులో ఒకటి ప్రభాస్ చిత్రం అయితే మరోకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రంట. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి 2 షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. బాహుబలి 2 షూటింగ్ పూర్తి అవ్వగానే వెంటనే రన్ రాజా రన్ ఫేం సుజీత్ డైరెక్షన్లో ప్రభాస్ ఓ సినిమాలో నటించనున్నాడు.
ఈ సినిమాని యువీ క్రియేషన్స్ నిర్మించనుంది. అలాగే 2017 మధ్యలో చరణ్ తో ఓ భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేశారట. ఇక ఈ సంస్థ వెనక ఉంది ప్రభాస్ అన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. ప్రభాస్ తన సన్నిహితులతో కలిసి ఈ సంస్థను తెరవెనక ఉండి నడిపిస్తున్నాడని వార్తలు కూడా వస్తున్నాయి. సో ఈ లెక్కన చూస్తే ప్రభాస్ నిర్మాణంలో చెర్రీ హీరోగా సినిమా వస్తోన్నట్టే అంటున్నారు.
Related