యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత మూడేళ్ళుగా బాహుబలి కోసం తన విలువైన టైంను కేటాయిస్తూనే ఉన్నాడు. ఈ మూడేళ్ళ సమయంలో బాహుబలి సినిమా కోసం యుద్ద సన్నివేశాలలో పాల్గొనడమే కాకుండా ఆ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. దాంతో ప్రభాస్ బాహుబలి-2 పూర్తి చేసాక ఖచ్చితంగా ఈ ప్రేమ కథా సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యాడట ప్రభాస్.
యుద్ద సన్నివేశాల్లో పాల్గొని మనసంతా ఒకలా అయిపోయిందని అందుకే దాని తర్వాత కూడా మళ్ళీ యాక్షన్ సినిమా చేసే బదులు ప్రేమ కథా చిత్రం అయితే బాగుంటుందని నిర్ణయించుకున్నాడట. అందుకే ప్రభాస్ యాక్షన్ సినిమాలకు దూరంగా ఉండి ప్రేమ కథ సినిమాలు చేయాలి అనుకుంటున్నాడట.
అందుకే కొత్త దర్శకులు సుజిత్ , రాధాకృష్ణ సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ప్రభాస్. జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కే ఈ ప్రేమ కథా సినిమాలో ప్రభాస్ సరసన కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని అన్వేశిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం విదేశాలలోనే జరుగనుందట.
Related